రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపిక 

లోకవాణి, అచ్చంపేట, నవంబర్ 04:  69వ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ కరాటే పోటీల్లో అచ్చంపేట పట్టణానికి చెందిన విద్యార్థులు పాల్గొని సత్తా చాటినట్లు శిక్షకులు సందీప్, అస్లాం తెలిపారు. మంగళవారం మహబూబ్నగర్ పట్టణ కేంద్రం లో జరిగిన పోటీల్లో అండర్ 14 బాలికల విభాగంలో రిషిత, దుర్గాదేవి ప్రతిభ కనబరిచి పతకాలు సాధించినట్లు తెలిపారు. వికారాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. వి ఆర్ స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్ అకాడమీ స్థాపకుడు రాజు నాయక్, తల్లిదండ్రులు అభినందించారు.

WhatsApp Join Now
Youtube Subscribe